లలితా సహస్రనామ పారాయణం
సహస్రనామాలలో ‘ లలితా సహస్రం’ అతి శక్తిమంతమైనది . ఈ మంత్ర విశిష్టత ఏమిటంటే : వేయినామాలలో ఏ నామము కూడా మరల రాదు , ఒకటి రెండు అలా వచ్చినట్లు అనిపించుతాయి కానీ , అది పద విభజనలో తేలిపోతుంది . మొత్తం శ్లోకాల సంఖ్య : 182 న్నర , అంటే 365 లో ( సంవత్సరములో ) సగం . ఏదో విశేషముంది. చిన్న నామాలున్నాయి , పెద్దవి కూడా ఉన్నాయి . అతి పెద్దనామాలు శ్లోకంలో ఒక పాదమంత . అతి చిన్న నామం ఒక అక్షరమే: ‘ఈ’ అని 138 వ శ్లోకంలో. “మననాత్ త్రాయతే మంత్రం” అన్నది తెలిసినదే . మరల మరల స్మరించిన / పఠించిన కొద్దీ తరింప ( దాటవేస్తుంది ) చేస్తుంది మంత్రం . పరమార్థంలో తరించటము మోక్షమయితే , లౌకికంగా సంసారంలోని బాథల నుండి క్రమక్రమంగా బయట పడవేస్తు...